రాంచీ : విచక్షణ మరిచిపోయి కుటుంబసభుల్ని సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడో పోలీస్ కానిస్టేబుల్. ఈ సంఘటన జార్ఖండ్లోని రాంచీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంచీకి చెందిన బ్రిజేశ్ తివారీ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాంచీలోని ఓ అద్దె ఇంట్లో భార్య, కొడుకు, కూతరుతో కలిసి నివాసముంటున్నాడు. శనివారం ఫుల్లుగా మద్యం సేవించిన అతడు ముగ్గురు కుటుంబసభ్యుల్ని సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పండారాలో నివాసం ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి ‘ నేను ఆ ముగ్గుర్ని చంపేశాను’ అంటూ కుటుంబసభ్యుల్ని హతమార్చిన సంగతి వివరించాడు. ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కానిస్టేబుల్ ఘాతుకం..కుటుంబసభ్యుల్ని..